మహబూబ్నగర్: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించేందుకు బీఆర్ఎస్, బీజేపీ ఒకటయ్యాయని రేవంత్ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల సెమీఫైనల్స్లో కేసీఆర్ను ఓడించామని.. మే 13న జరిగే ఫైనల్స్లో బీజేపీని ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదని కేటీఆర్ అంటున్నారని.. కేటీఆర్ చీరకట్టుకుని ఆర్టీసీ బస్సు ఎక్కితే హామీలు అమలు గురించి తెలుస్తుందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు గ్యారంటీలు అమలు చేసిందన్నారు తెలంగాణ సీఎం, టీపీసీసీ […]