ఎన్నికల కమిషన్ సంచలనం.. ఇద్దరు అధికారుల పై వేటు!

అనంతపురం డీఎస్పీ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, డీఎస్పీ వీరరాఘవరెడ్డి, సీఐ ప్రతాపరెడ్డిని సస్పెండ్ చేయాలని తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్నికల సంఘాన్ని కోరారు. అనంతపురం టీవీ టవర్ సమీపంలో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ జరిగింది. అయితే డీఎస్పీ మాత్రం ఉద్దేశపూర్వకంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జయరాం నాయుడిని అరెస్ట్ చేశారని ఆరోపించారు. వీరిని ఎన్నికల విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో డీఎస్పీపై ఈసీ బదిలీ వేటు వేసింది.

ఏపీలో ఇద్దరు డీఎస్పీలపై ఎన్నికల కమిషన్ వేటు వేసింది. అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి, అన్నమయ్య జిల్లా రాయచోటి డీఎస్పీ సయ్యద్ మహబూబ్ బాషాను బదిలీ చేసింది. తెలుగుదేశం పార్టీ నేతలు డీఎస్పీ రాఘవరెడ్డిపై ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపిన ఈసీ వెంటనే బదిలీ చేసింది. తమ కింద అధికారులకు ఆ బాధ్యతలు అప్పగించాలని ఆదేశించింది. ఈసీ ఆదేశాల మేరకు ఇద్దరు డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీచేశారు. వీరిని వెంటనే పోలీస్ ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.

0Shares
Categories: , ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *