శరీరానికి బలం…. చక్కటి సువాసన – సుగంధి పాల మొక్క
క్యాపిటల్ వాయిస్, ఆరోగ్య సమాచారం :-సుగంధి పాల మొక్క వేరు చక్కని సువాసనను కలిగి ఉంటుంది. ఈ వేరును శుభ్రంగా కడిగి నీటిలో వేసి మరిగించగా ఎర్రని కషాయం తయారవుతుంది. ఈ కషాయాన్ని తాగడం వల్ల శరీరానికి బలం చేకూరుతుంది. శరీరంలో ఉండే వేడి అంతా పోయి చలువ చేస్తుంది అధిక వేడి వల్ల కలిగే అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాం.నల్ల సుగంధి, ఎర్ర సుగంధి, తెల్ల సుగంధి ఇలా అనేక రకాలు ఉంటాయి. ఈ సుగంధి వేర్లతో కషాయాన్ని తయారు చేసి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. సుగంధి పాల మొక్క వేరు కషాయాన్ని తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి రోగాల బారిన పడకుండా ఉంటాం. సుగంధి పాల మొక్క వేరు కషాయాన్ని తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి రోగాల బారిన పడకుండా ఉంటాం.జ్వరం వచ్చినప్పుడు ఈ కషాయాన్ని తాగడం వల్ల జ్వరం త్వరగా తగ్గుతుంది. ఈ సుగంధి పాల మొక్క వేరును కడిగి నేరుగా నోట్లో పెట్టుకుని నమిలి రసాన్ని మింగవచ్చు. సుగంధి పాల మొక్క వేరు కషాయాన్ని తాగడం వల్ల కీళ్ల నొప్పులుచర్మ వ్యాధులు కూడా తగ్గుతాయి. శరీరంలో ఉండే మలినాలు తొలగిపోతాయి. చర్మం ఆరోగ్యంగా ఉండడంతోపాటు కాంతివంతంగా కూడా తయారవుతంది. శరీరంలో రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది.