అమ్మల త్యాగాలు….  దేశం కోసం వజ్రాలు !!
క్యాపిటల్ వాయిస్, ప్రత్యేక కధనం :- ప్రతిజీవికీ తన మొదటి గుండె చప్పుడుతో ప్రారంభమయ్యే బంధం అమ్మ. అంతులేని ప్రేమానురాగాలకు, ఆప్యాయతకు మారుపేరైన తల్లి ఎవరికైనా ప్రత్యక్ష దైవమే. మాటల్లో చెప్పలేని బంధం తల్లీ బిడ్డలది. అందుకే తల్లే బిడ్డకు తొలి గురువు. అందుకే తల్లుల త్యాగాలను గుర్తిస్తూ మదర్స్ డే నిర్వహించాలని అమెరికాలో ‘జూలియవర్డ్ హూవే’ అనే మహిళ 1872లో ప్రతిపాదించింది. ఆ తర్వాత పశ్చిమ వర్జీనియాకు చెందిన అన్నా జార్వీస్ దీని గురించి 1890లో విస్తృతంగా ప్రచారం చేశారు. తొలిసారి మదర్స్ డేను 1910లో పశ్చిమ వర్జీనియాలో ఒక చర్చిలో జరుపుకున్నారు. 1911 నాటికి అమెరికాలోని అన్ని రాష్ట్రాలలో మదర్స్ డే ఒక సంప్రదాయంగా మారింది.1914లో అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ మాతృ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించారు. కాలక్రమేణా ప్రతి సంవత్సరం మే నెల రెండో ఆదివారం ప్రపంచవ్యాప్తంగా మాతృ దినోత్సవాన్ని జరుపుతున్నారు.
అంతర్జాతీయం తల్లుల దినోత్సవం పురస్కరించుకుని ఈ నేపథ్యంలో మన దేశ ప్రతిష్ఠను ప్రపంచానికి చాటి చెప్పిన పలువురు క్రీడాకారుల మాతృమూర్తుల గురించి, బిడ్డలను ప్రయోజకులను చేయడంలో వారు చేసిన త్యాగాల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..
మనికా బాత్రా – సుష్మా బాత్రాఒత్తిడిలోనూ శరవేగంగా స్పందించగల చురుకుదనం, బాల్ని ప్రతికూల స్థితిలోనూ నియంత్రించగల సత్తా మనికాను భారత టేబుల్ టెన్నిస్ క్వీన్ మార్చేశాయి. అలాగే సింగిల్స్ లో అత్యుత్తమ ర్యాంకు అందుకున్న మొదటి మహిళగా రికార్డు అందుకుంది. కాలేజీ మధ్యలోనే చదువు ఆపేసి క్రీడలపై దృష్టి పెట్టిన తనను తల్లి సుష్మ పూర్తిగా ప్రోత్సహించారని చెబుతోందామె. గతేడాది ప్యారిస్ ఒలింపిక్స్లో పాల్గొన్న మనిక.. రౌండ్-16 ప్రిక్వార్టర్సు చేరుకొని.. ఈ ఘనత సాధించిన తొలి భారత టీటీ క్రీడాకారిణిగా నిలిచింది. మనికాకు ఊహ తెలిసినప్పటి నుంచే ఆమె తండ్రి మానసిక సమస్యలతో ఇబ్బంది పడేవారు. దీంతో కుటుంబ భారం అంతా తల్లి సుష్మ పైనే పడింది. ఆమె ఒక ఫ్యాషన్ డిజైనర్. కుటుంబంలోని సవాళ్లను ఎదుర్కొంటూనే ముగ్గురు పిల్లలను పెంచి పెద్ద చేశారు. వారందరూ ఇప్పుడు టేబుల్ టెన్నిస్లో రాణిస్తున్నారు. ‘నేను స్కూల్లో ఎక్కువగా బ్యాడ్మింటన్ ఆడేదాన్ని. కానీ కొన్ని కారణాల వల్ల క్రీడాకారిణిని కాలేకపోయా. అనుకున్నది సాధించక నా పిల్లలు నాలా బాధపడకూడదనుకున్నా, అందుకే వాళ్లకు నచ్చిన రంగంలో ప్రోత్సహించా’ అని చెబుతున్నారు సుష్మ.
గ్రాండ్ మాస్టర్ల అమ్మ నాగలక్ష్మిమొట్టమొదటిసారి అక్కాతమ్ముళ్లిద్దరూ గ్రాండ్ మాస్టర్లైన రికార్డు వైశాలీ, ప్రజ్ఞానంద నెలకొల్పారు. అయితే వీరి విజయంలో తల్లి నాగలక్ష్మి తోడ్పాటు ఎంతో ఉంది. గృహిణికి ఏం తెలుసు.. వంట.. ఇంటి పని చేయడం తప్పా.. అనుకొనేవారి ఆలోచనలను మార్చారు నాగలక్ష్మి. వైశాలి టీవీ ఎక్కువగా చూస్తుందని ఒక చెస్ బోర్డ్ కొనిచ్చారు ఆమె తండ్రి రమేశ్. తండ్రి నేర్పించిన మెలకువలకు తన ఆసక్తి తోడై వైశాలి చాలా త్వరగానే చెస్ నేర్చుకుంది. ఆ తర్వాత అమ్మ ప్రోత్సాహంతో వైశాలి ఆటపై పట్టు సాధించింది. ఆట నేర్పించడం, అందుకు అవసరమైన వసతులు సమకూర్చడం, స్కూలుకు తీసుకెళ్లడం, చదువులో ముందుండేలా సాయం చేయడం నాగలక్ష్మి దినచర్యగా మారిపోయింది. కొన్ని రోజులకు కూతురితో పాటు కొడుక్కి కూడా ఆటను నేర్పించింది. చదువు, చదరంగం రెండింట్లో రాణిస్తున్న పిల్లలను చూసి తెగ సంబరపడిపోయేది. టోర్నమెంట్లకు వెళ్లినప్పుడల్లా పిల్లలతో పాటు నాగలక్ష్మి వెళ్లేది. వారికి ఫుడ్ సరిపడదని ఎక్కడికి వెళ్లినా ఓ గ్యాస్ స్టవ్, కొంచెం బియ్యం, పప్పు తీసుకెళ్లి వారికి వంట చేసి పెట్టేవారట. ‘వాళ్లు ఎంత ఎదిగినా నా కంటికి చిన్నపిల్లల్లానే కనబడతారు. అందుకే శ్రమ అనుకోకుండా వాళ్లతో పాటే వెళ్లిపోతాను’ అంటూ ఆమె చెబుతున్నారు.
బలహీనతల్ని బలాలుగా మార్చిన పోలీసమ్మపోలీసు ఉద్యోగం అంటేనే సమయంతో సంబంధం లేకుండా పరుగులు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి బాధ్యత కలిగిన ఉద్యోగం చేస్తూ కూతురిని క్రీడల్లో ప్రోత్సహించారు భారత జూడో ప్లేయర్ తూలికామన్ తల్లి అమృత. తూలికకు రెండేళ్ల వయసున్నప్పుడు భర్తను పోగొట్టుకున్న అమృత ఒంటరిగానే తన కూతురిని పెంచి పెద్ద చేసింది.గతేడాది ప్యారిస్ ఒలింపిక్స్లో పాల్గొన్న తూలిక.. మన దేశం తరఫున ఈ క్రీడలో పాల్గొన్న ఏకైక ప్లేయర్గా నిలిచింది. ‘తూలిక జూడోలో శిక్షణ తీసుకునే క్రమంలో ఇంటిని, కెరీర్ ను బ్యాలన్స్ చేయడం కాస్త కష్టంగానే అనిపించేది. ఈ క్రమంలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా. ఏదైతేనేం.. నా కూతుర్ని తనకు నచ్చిన రంగంలో ప్రోత్సహించానన్న సంతృప్తి నాకు దక్కింది. తన విజయాలే నేను పడిన కష్టాన్ని మరిపిస్తున్నాయి..’ అంటున్నారు అమృత,
సీఏ భవానీ దేవి2018 కామన్వెల్త్ క్రీడల్లో వ్యక్తిగత విభాగంలో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ మహిళా క్రీడాకారిణిగా భవానీదేవి రికార్డులకెక్కారు.2015లో ఆమె కాంస్యం, 2014 ఏషియా ఛాంపియన్ షిప్ లో అండర్ -23 విభాగంలో రజతంతోపాటు, పలు అంతర్జాతీయ పోటీల్లో కూడా పతకాలు సాధించారు. వాళ్ల అమ్మ నగలు అమ్మితే వచ్చిన 6 వేల రూపాయలతో తొలి ఫెన్సింగ్ కిట్ కొనుక్కుంది. పర్యటనల ఖర్చులు భరించే స్థోమత లేక ఫెన్సింగ్ వదిలేయాలని భవానీ దేవి భావించింది. కానీ వాళ్ల అమ్మ ఒప్పుకోలేదు. శ్రమ కు తగ్గ ఫలితం కచ్చితంగా వస్తుంది.. వెనుకడుగు వేయవద్దు అని ధైర్యం నింపింది. భవానీ దేవిఫెన్సింగ్ 8 సార్లు జాతీయ చాంపియన్ గా నిలిచింది. టోక్యో ఒలింపిక్స్లో భారత్ నుంచి ఫెన్సింగ్ ప్రాతినిధ్యం వహించిన ఏకైక అథ్లెట్ భవానీ దేవీయే కావడం విశేషం. టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫైయింగ్ మ్యాచు భవానీ హంగేరీ వెళ్లాల్సి వచ్చింది. అదే సమయంలో ఆమె తల్లి కరోనాతో ఐసీయూలో చికిత్స తీసుకుంటుంది. అప్పటికే తండ్రిని కోల్పోయిన భవానీ.. ఆ సమయంలో మ్యాచ్ వదులుకుని తల్లి దగ్గరే ఉండాల ని అనుకుంది. కానీ ఆమె తల్లి మాత్రం భవానికి ధైర్యం చెప్పింది. ‘నేను వైరస్ ను గెలుస్తా.. నువ్వు ఆటలో గెలువు’ అని కూతురిని సాగనంపింది. 
జస్పీత్ బుమ్రా – దల్జిత్ కౌర్ బుమ్రా  :  జస్త్రీత్ బుమ్రాది పంజాబీ కుంటుంబం, తండ్రి జస్వీర్ సింగ్, తల్లి దల్జిత్ కౌర్ బుమ్రా. బుమ్రాకు ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు తండ్రి జస్వీర్ సింగ్ మరణించాడు. తండ్రిలేని బిడ్డ అయిన మనవడిని, భర్తను కోల్పోయి బాధలో ఉన్న కోడలిని చేరదీయాల్సిన బుమ్రా తాత సంతోక్ సింగ్ బుమ్రా.. వాళ్లను వదిలేసి వేరే ఊరికి వెళ్లిపోయాడు. భర్త మరణం, మామగారు పట్టించుకోకపోవడంతో.. బుమ్రా తల్లి ఒంటరిదైపోయింది. అదే ఆమెలో కసి పెంచింది. ఎలాగైనా తన కొడుకును గొప్పవాడ్ని చేయడానికి.. కంకణం కట్టుకుంది. అప్పటికే వస్త్రపూర్లోని ఓ పాఠశాలలో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న ఆమె.. తన బిడ్డకోసం మరింత కష్టపడింది. చిన్నతనం నుంచి బుమ్రాకు క్రికెట్పై ఉన్న ఇష్టాన్ని పసిగట్టిన తల్లి దల్జిత్ కౌర్.. బుమ్రాను క్రికెట్ వైపు ప్రోత్సహించింది. ఎంతో కఠినమైన పరిస్థితుల నుంచి ఎంతో కష్టపడి బుమ్రా క్రికెటర్గా ఎదిగాడు. భర్త అండ లేకపోయినా.. అత్తింటివారు పట్టించుకోకపోయినా.. బుమ్రా తల్లి ఓ యోధురాలిలా బుమ్రాను గొప్ప బౌలర్గా తయారు చేసింది. నిజానికి దేశం కోసం ఒంటరిగా ఒక వజ్రాయుధాన్ని తయారుచేసిందనే చెప్పాలి. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top