ప్రకృతి మాతకు ముప్పు తలపెడుతున్న మానవాళి !!

ప్రకృతి మాతకు ముప్పు తలపెడుతున్న మానవాళి !!

# వన్యప్రాణుల మనుగడ ప్రశ్నర్థకంగా మారుతున్న వైనం!!

క్యాపిటల్ వాయిస్, అమరావతి :- అడవులలో ఆహారం కరువై వన్యప్రాణులు జనావాసాలపై దూసుకువచ్చి మానవాళిపై, పశువులపై భీకర దాడులకు పాల్పడుతున్న దయనీయస్థితి! ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసిన వన్యప్రాణులు అయినటువంటి క్రూరమృగాలు ఎక్కడో ఒక చోట పశువులపైనే, మనుషుల పైనో దాడులకు పునుకుంటూ చివరకు అడవిలో ఆహారం కరువై తమ కడుపు నింపుకునేందుకు వాటికీ తటస్థ పడిన ఏ పశువు అయిన, మనిషి అయిన చంపుకు తినేందుకు వెనుకంజ వేయడం లేదు అంటే పరిస్థితి ఎంత దారుణంగా తయారు అయ్యిందో మనం ఇట్టే ఊహించవచ్చు. అందుకు తాజా ఉదాహరణ ఈ మధ్యనే తిరుమల తిరుపతికి నడక మార్గాన వెళ్లే దారిలో ఓక కుటుంబానికి చెందిన చిన్నారిని నిర్ధాక్షిణ్యంగా క్రూరమృగం పులి అడవిలోకి లాక్కెళ్ళి మరీ పొట్టన పెట్టుకున్న వైనం ఇంకా మన మనస్సుల్లో మెదలుతూనే వుంది. మరికొన్ని చోట్ల అయితే ఏనుగులు, గజరాజులు అడవుల్లోనుంచి ఓక మందంగా దూసుకువచ్చి ఏడా పేడా చేతికి వచ్చిన మన రైతన్నల పంట పొలాలను నాశనం చేయడం, అడ్డువచ్చిన మనుషులను, పశువులను సైతం నిర్ధాక్షిణ్యంగా తొక్కి వేసి వారిని,వాటి ప్రాణాలను అర్ధాంతరంగా ఈ గజరాజులు బలిగోంటున్న వైనం మనందరికీ నిత్యం తెలుస్తున్న ఉదంతాలే. ఈ దారుణ, దయనీయ పరిస్థితులు ఏర్పడటానికి గల కారణాలను ఒక్కసారి విశ్లేసించవలసి వస్తే మన మానవజాతే చేజేతులారా అడవిలో వున్న వృక్షసంపదను తమ స్వార్థానికి, లాభాపేక్షకు ఆశ పడి సర్వనాశనం చేయడం మొదలుపెట్టడమే ప్రస్తుతం వున్న ఈ దుస్థితికి ప్రదాన కారణంగా మనం చెప్పుకోవొచ్చు. ఇందుకు ప్రతి ఒక్కరూ బాద్యులే, ఎలాగంటే అటు ప్రభుత్వం వారు, ఇటు మానవాళి అభివృద్ధి పేరిట ఇష్టానుసారంగా అడవులను నరికివేస్తూ పారిశ్రామిక అభివృద్ధికి వినియోగిస్తుండటంతో రోజు రోజుకు అడవుల విస్తీర్ణం తగ్గిపోతూ అంతిమంగా వన్యప్రాణుల మనుగడే ప్రశ్నర్థకమయ్యే స్థాయికి చేరుకోవడం ఎంతైనా బాధాకరమైన విషయం. ఈ దారుణ,దయనీయ,సంక్లిష్ట పరిస్థితులకు అడ్డుకట్ట వేయాలంటే అటు ప్రభుత్వం వారు, ఇటు మానవాళి మానవతాదృక్పదం తో చేయాల్సిన తక్షణ కర్తవ్యం పని ఒక్కటే. అదేమంటే ‘ వృక్షో రక్షతి రక్షిత: ‘ అనే నానుడికి మనసా, వాచ, కర్మణ కట్టుబడి ఇక నుంచి చెట్ల, వృక్ష సంరక్షణకు నడుం బిగించాల్సిన గురుతర బాధ్యత ప్రతి ఒక్కరిపై వుంది. అంటే దీని ఉద్దేశం ప్రతి చోట చెట్లు నాటే కార్యక్రమానికి స్వీకారం చుట్టడం, అది ప్రభుత్వ కార్యాలయం కావొచ్చు, మన ఇంటి అవరణలలో కావొచ్చు.ఇందులో భాగంగా పలు స్వచ్చంద సంస్థలు, ప్రభుత్వ సంస్థలు ఇప్పటికే ఈ బృహత్తర కార్యక్రమానికి నడుం బిగించి తమ వంతుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిన పక్కా వాస్తవం. ఏదిఏమైనా ఇప్పటికయినా మనమంతా చల్లటి గాలులతో, పచ్చటి పైర్లలో జీవనం సాగించాలన్న, సకాలంలో వర్షాలు కురిసి రైతన్నలకు మంచి పాడి పంటలు పండి మనం మంచి పుష్టికరమైన ఆహారాన్ని భూజించాలన్న మనం చేయాల్సిన తక్షణ కర్తవ్యం, బాధ్యత ప్రకృతి మాతకు ప్రణవిల్లడమే. అంటే ప్రకృతి సంపదను కాపాడటమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ యుద్ధ ప్రాతిపదికన అవిరళ కృషి అరంభించాల్సిన ఆ శుభ తరుణం ఇదే. ఏమైనా ఇకనైనా మానవాళి ఈ ప్రకృతి వినాశకానికి బ్రేక్ వేసి ప్రకృతి సంరక్షణ, ప్రకృతి సంపద పెంపుదల దిశగా ముందడుగు వేస్తే అది ప్రస్తుత, రాబోయే తరాల వారికి ఎనలేని మేలు జరగడంతో పాటు అటు మన భారతదేశం ప్రకృతి మాత ఒడిలో చాలా సగర్వంగా సేద తీరెందుకు మనమంతా ఓక వజ్రాయుదాన్ని,రక్షణ కావచాన్ని తయారుచేసి మన భరతమాతకు ఇచ్చినవారమవుతాము! ప్రకృతి మాత నీకు మా శతకోటి వందనాలు!ప్రకృతిమాత లేనిదే మానవాళికి మనుగడ లేదు కాక లేదు!ఇది ఎవ్వరూ కాదనలేని అక్షర, నగ్న సత్యం. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top